రైల్వే ఉద్యోగి అనుమానాస్పద మృతి
అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే కార్యాలయంలో ఒక వ్యక్తి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి గుంతకల్లులో డీపీఓ సెక్షన్ ఆఫీస్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఆజీజ్ పాషా(42) గా గుర్తించారు. మృతుడు కర్నూలు జిల్లా వాసి అని తెలిపారు. ఇతనికి పెళ్లి కాలేదు. ఒంటరిగానే శాంతినగర్లోని 625 నంబర్ క్వార్టర్లో ఉంటున్నాడు. అయితే శనివారం ఉదయం ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతిచెంది ఉండగా ఇరుగు పొరుగువారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.