కౌలు రైతు ఆత్మహత్య


అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య  చేసుకున్నాడు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా ఆర్. ఎస్ కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎన్. రవిశంకర్‌రెడ్డి(40) తనకున్న ఎకరంతో పాటు మరో ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.


ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కానరాక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top