చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి


చెట్టు పైనుంచి కాలు జారి కింద పడిపోయిన వ్యక్తి  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముళ్లపాడు గ్రామంలో సుంకాల నాగులూరి (50) చింత కాయలు కోసుకునేందుకు ఈ నెల 1న చెట్టు ఎక్కాడు. అక్కడి నుంచి జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చికిత్స కోసం అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top