కూచిపూడికి రాష్ట్ర కళ హోదా


రాజమండ్రి కల్చరల్ (తూర్పుగోదావరి): కూచిపూడి నాట్యాన్ని రాష్ట్ర కళగా ప్రభుత్వం గుర్తించిందని ఏపీ దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఆదివారం రాజమండ్రి రామకృష్ణ మఠం ఆడిటోరియంలో జరిగిన జాతీయ కూచిపూడి నాట్య పోటీలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కృష్ణా జిల్లా, కూచిపూడి గ్రామంలో కూచిపూడి భవనాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. కాగా, కూచిపూడి పోటీలలో పాల్గొన్న విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top