నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్

నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్ - Sakshi


రూ.2.16 లక్షల నకిలీ కరెన్సీ, 5 సెల్‌ఫోన్లు, ప్రింటర్ స్వాధీనం

 

 గుంతకల్లు రూరల్ :

 నకిలీ నోట్ల తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.16 లక్షల నకిలీ కరెన్సీ, ఐదు సెల్‌ఫోన్లు, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సుబ్రమణ్యం వెల్లడించారు.


హైదరాబాద్‌లోని నాగారం ప్రాంతానికి చెందిన కామేశ్వరరావు కర్నూలు జిల్లా రేమట గ్రామానికి చెందిన చిన్నబాబు, వీరేష్‌నగర్‌కు చెందిన బాబు, సునీల్, కల్లూరుకు చెందిన కుమార్‌తో కలిసి ముఠాగా ఏర్పడి కర్నూలులో నకిలీ నోట్లు ముద్రించేవారు. రూ.2.16 లక్షల నకిలీ కరెన్సీని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలో చలామణి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ రాగిరి రామయ్య, కసాపురం ఎస్‌ఐ వెంకటరెడ్డిలు తమ సిబ్బందితో దాడులు చేసి దోసలుడికి క్రాస్ వద్ద వారిని అరెస్ట్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top