11 మంది సీపిఐఎమ్‌ఎల్‌ న్యూడెమోక్రసీ సభ్యుల అరెస్ట్


పశ్చిమ గోదావరి జిల్లా: పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం పడమర రేగులకుంటలో 11 మంది సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



జల్లేరు వాగు వద్ద సమావేశమయ్యారనే సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరి నుంచి 8 తుపాకులు,బుల్లెట్లు ,మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.


పట్టుబడిన వారు చంద్రన్న ,అశోక్ వర్గాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరిని జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top