కుకునూరులో ఉద్రిక్తత
కుకునూరు: ఖమ్మం జిల్లా కుకునూరులో గురువారం ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సహా ఎంపీ మాగంటి బాబు తొలిసారి పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కుకునూరులో జరిగిన సమావేశంలో ఎంపీ మాగంటి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అనుచరుల ఆందోళనకు దిగారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిగా జై ఆంధ్ర అంటూ మాగంటి అనుచరులు నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా తాటి వెంకటేశ్వర్లు అనుచరులపై దాడికి యత్నించారు.