శాసనమండలి ప్రాంతంలో ఉద్రిక్తత


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సందర్భంగా శాసనమండలి వద్ద కాసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సోమవారం కొత్తగా ఎన్నికైన వైఎస్ఆర్ సీపీ, ఎమ్మెల్సీలు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీ, టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల అభిమానుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు పార్టీల కార్యకర్తలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top