'గోడ దూకి వెళ్లైనా పాదయాత్ర చేస్తా'


కిర్లంపూడి: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల ఒత్తిడిని తట్టుకోలేక ఏదో ఒక రోజు గోడ దూకి వెళ్లైనా పాదయాత్ర చేస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ముద్రగడ మరోసారి పాదయాత్ర చేసేందుకు ప్రయత్నించగా పోలసులుల అడ్డుకున్నారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తీరుకు నిరసనగా తన నివాసం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. ముద్రగడ గేటు బయట చేపట్టిన ఆందోళనకు కాపులు తరలివచ్చి మద్దతు తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top