ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ, 10మందికి గాయాలు


కడప: జిల్లాలోని కాజీపేట మండలం సిద్ధాంతపురం సమీపంలో గురువారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో 10మందికి గాయాలయ్యాయి. ఆగిఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top