తగ్గుముఖం పట్టనున్న ఉష్ణోగ్రతలు


హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి ప్రతాపం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు వడదెబ్బతో మృతిచెందారు. రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యభారతం నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ ద్రోణి కొనసాగుతుంది. అదే విధంగా ద్రోణి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్ర వెల్లడించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top