శ్రీవారిని దర్శించుకున్న మంత్రి జోగు రామన్న
తిరుమల : తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న కుటుంబసభ్యులతో కలసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు.