అందరికీ ఆప్షన్లు!

అందరికీ ఆప్షన్లు!


ఉద్యోగుల పంపిణీపై కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఖరారు

 

రాష్ట్ర క్యాడర్, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులే విభజన

మిగతా ఉద్యోగులు ఎక్కడి వారక్కడే

‘ఏడేళ్ల విద్యాభ్యాసం’ నిబంధన మేరకు పంపిణీ

కేటాయింపుల్లో సీనియర్లకు ప్రాధాన్యత

మార్గదర్శకాలపై అభ్యంతరాలకు 5 వరకు గడువు

ఉద్యోగుల విభజనతో తొలుత తాత్కాలిక జాబితా

దీనిపై ఫిర్యాదులకు మరో రెండు వారాల గడువు




రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉద్యోగుల కేటాయింపుపై కమలనాథన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఆ మేరకు మార్గదర్శకాలు ఖరారు చేసింది. పంపిణీకి అవకాశం ఉన్న ఉద్యోగులందరికీ ఆప్షన్ ఇవ్వనున్నారు. ‘ఏడేళ్ల విద్యాభ్యాసం’ నిబం ధన మేరకు ‘స్థానికత’ను నిర్ధారించనున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తమ అభిప్రాయూలను తెలియజేశారు. అనంతరం ఉద్యోగుల పంపిణీపై కమిటీ మార్గదర్శకాలు ఖరారు చేసింది. కమిటీ సభ్య కార్యదర్శి పి.వి.రమేష్ పేరిట ఏపీ రీఆర్గనైజేషన్ వెబ్‌సైట్లో వివరాలను పొందుపరిచింది. మార్గదర్శకాలపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పంపించడానికి వచ్చే నెల 5 వరకు గడువు ఇచ్చింది. అభ్యంతరాలు, సూచనలను.. ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ, పునర్వ్యవస్థీకరణ (ఎస్‌ఆర్) విభాగం, ఏపీ సచివాలయం చిరునామాకు పంపించాలని సూచించింది. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది మార్గదర్శకాలను వెల్లడించనున్నారు. అనంతరం ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకొని ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు చేయనున్నారు. తొలుత కేటాయింపుల తాత్కాలిక జాబితా వెల్లడించి.. ఉద్యోగుల అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించడానికి రెండు వారాల గడువు ఇవ్వనున్నారు.



 

తుది జాబితా విడుదల చేయనుంది.  మార్గదర్శకాలు ఇవీ..



   2011 జనాభా లెక్కల మేరకు ఇరు రాష్ట్రాల జనాభా నిష్పత్తిలో పోస్టుల విభజన ఉంటుంది. తెలంగాణకు 41.68 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 58.32 శాతం పోస్టులు కేటాయించనున్నారు.

►  అవిభక్త రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ చేయడానికి వీలున్న ఉద్యోగులు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది, రాష్ట్ర క్యాడర్ అధికారులు, రెండు రాష్ట్రాల మధ్య బదిలీకి అవకాశం ఉన్న మల్టీ జోనల్ క్యాడర్ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు విభజించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థలు, ప్రాజెక్టుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను విభజించనున్నారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ ఉద్యోగులనూ రెండు రాష్ట్రాలకు పంచనున్నారు.

►  చఛగ్రామం, పట్టణం, సర్కిల్, మండలం, డివిజన్, జిల్లా, జోన్, మల్టీ జోన్(సీమాంధ్ర, తెలంగాణకు ఉమ్మడిగా లేని జోన్లు) పోస్టుల్లో పనిచేస్తున్న వారు విభజన పరిధిలోకి రారు. ఏ రాష్ట్రంలో ఉన్నవారిని ఆ రాష్ట్రానికే కేటాయించినట్లుగా భావించాలి.

  భౌగోళికంగా ఏదో ఒక రాష్ట్రానికే చెందిన ఉద్యోగాలను ఆ రాష్ట్రానికే కేటాయించనున్నారు. ఆ పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను ఆ రాష్ట్రంలోనే కొనసాగించాలి.

►   తొలుత మొత్తం పోస్టులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసిన తర్వాత ఉద్యోగుల కేటాయింపులు ప్రారంభిస్తారు. కొత్త రాష్ట్రాల ఆవిర్భానికి ముందురోజు (2014 జూన్1) వరకు ఉన్న సీనియారిటీని కేటాయింపులకు ఆధారంగా తీసుకోనున్నారు. దీర్ఘకాలంగా గైర్హాజరవుతున్న, సెలవులో ఉన్న, ఆచూకీ లేని ఉద్యోగులతో పాటు డిప్యుటేషన్, శిక్షణలో ఉన్న ఉద్యోగులనూ కేటాయింపుల్లో పరిగణనలోనికి తీసుకోవాలి.

ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి అవకాశం ఉన్న ఉద్యోగులందరికీ ‘ఆప్షన్’ ఇవ్వనున్నారు. పాలనా సౌలభ్యం, ప్రజా ప్రయోజనాలు, ఆయా రాష్ట్రాల అవసరాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ రాష్ట్రానికి కేటాయించాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. అందరి కంటే సీనియర్లు ఇచ్చిన ‘ఆప్షన్’కు ప్రాధాన్యత ఉంటుంది. ఏ రాష్ట్రంలో అయినా నిర్దిష్ట క్యాడర్‌లో పోస్టులు మిగిలిపోతే అందరికంటే జూనియర్లను (రివర్స్ సీనియారిటీ ఆధారంగా) ఆ రాష్ట్రానికి కేటాయిస్తారు.

►   రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న ‘ఏడేళ్ల విద్యాభ్యాసం’ నిబంధన మేరకు స్థానికతను నిర్ధారిస్తారు. సర్వీసు రికార్డులో పేర్కొన్న మేరకు లేదా విద్యాభ్యాసం ధ్రువపత్రాల ఆధారంగా స్థానికతను సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ధ్రువీకరించాలి. తప్పుడు పత్రాలు పెట్టినట్లు రుజువయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. అయితే ఈ నిబంధన ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ స్థానికులు కాని ఉద్యోగుల స్థానికతను వారి స్వస్థలం ఆధారంగా నిర్ణయిస్తారు.

   ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను వారిచ్చిన ఆప్షన్ మేరకే కేటాయిస్తారు. ఆప్షన్ ఇవ్వకపోతే వారి స్థానిక రాష్ట్రానికి కేటాయిస్తారు.

   నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లను స్థానికత ఆధారంగా కేటాయిస్తారు. ఆప్షన్ ఇస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి వీలయినంతమేర ప్రయత్నిస్తారు.

అఖిల భారత సర్వీసు అధికారి భార్య/భర్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే, వారి ఆప్షన్ మేరకే కేటాయింపు ఉంటుంది.

    దంపతులు ఇద్దరూ ఉద్యోగులైతే వారిచ్చే ఆప్షన్ మేరకు ఇద్దరినీ ఒకే రాష్ట్రానికి కేటాయిస్తారు.

  ఒంటరి మహిళలు (వితంతువులు, విడాకులు తీసుకున్నవారు), 40 శాతానికి మించి అంగ వైకల్యం ఉన్న వారి ఆప్షన్లకు ప్రాధాన్యత ఇస్తారు.

   ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్, మూత్రపిండాల సమస్య, ఇతర తీవ్రమైన రోగపీడితులుంటే.. వారి ఆప్షన్ ప్రకారమే కేటాయింపులు జరుపుతారు.

   స్థానికత అర్హత ఉన్న ఉద్యోగులుంటే తప్ప ఖాళీ పోస్టులను ఉద్యోగుల పంపిణికీ వాడకూడదు.

    క్యాడర్ కూర్పులో డెరైక్ట్ రిక్రూటీలు, ప్రమోటీల శాతాన్ని, రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకొని పంపిణీ చేయూలి.

    కొన్ని శాఖల్లో మంజూరు పోస్టు ఒక్కటే ఉన్నా, అదే క్యాడర్‌లో చాలామంది ఉద్యోగులు ఉంటారు. అలాంటి సందర్భంలో ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తారు.

   బోధన, వైద్య రంగంలో స్పెషలైజేషన్ వారీగా పోస్టులను విభజించి ఇరు రాష్ట్రాలకు కేటాయించాలి. సీనియారిటీని కూడా స్పెషలైజేషన్ వారీగానే నిర్ధారించాలి.

   ఇతర శాఖలు, విభాగాలు, సంస్థల్లో డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నా.. మాతృశాఖలోనే చూపించాలి.

    సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, ప్రాజెక్టుల్లో డిప్యుటేషన్ లేదా టెన్యూర్ మీద పనిచేస్తున్న లోకల్ క్యాడర్ ఉద్యోగులను వారి మాతృశాఖకు పంపిస్తారు.

►   ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థల ద్వారా రాష్ట్రాల ఆవిర్భావానికంటే ముందే కేటాయించి ఉంటే.. వారి ప్రాధాన్యతను అడుగుతారు. కానీ ఏ రాష్ట్రానికి కేటాయించినా పని చేయాల్సిందే.

►   ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు-9, 10లో పేర్కొన్న సంస్థలు, సంఘాల ఉద్యోగుల విభజననూ కమలనాథన్ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షిస్తుంది.

రాష్ట్ర విభజన తర్వాత ఏ రాష్ట్రమైనా కొత్త పోస్టులు సృష్టించి ఉంటే, ఉద్యోగుల తుది కేటాయింపులో వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.



 కేటాయింపు ప్రక్రియ ఇలా..



‘ఆప్షన్’ తెలియజేయూల్సిందిగా విభజన జాబితాలో ఉన్న ఉద్యోగులందరినీ కోరతారు. ఇందుకు నిర్దిష్ట ఫార్మాట్‌ను కమిటీ రూపొందించింది. మార్గదర్శకాలు, ఫార్మాట్‌ను.. జ్ట్టిఞ://ట్ఛౌటజ్చజీట్చ్టజీౌ.్చఞ.జౌఠి.జీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పూర్తి చేసిన ఆప్షన్ పత్రాలను సంబంధిత శాఖాధిపతికి సమర్పించాలి.

  ఆప్షన్ పత్రాల్లో పేర్కొన్న అంశాలను శాఖాధిపతి పరిశీలించి ధ్రువీకరించాలి. ధ్రువీకరించిన పత్రాలను ‘సభ్య కార్యదర్శి, సలహాసంఘం, ఎస్‌ఆర్ డిపార్ట్‌మెంట్, ఏపీ సచివాలయం’కు సంబంధిత శాఖాధిపతి ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో పంపించాలి.

నిర్దారిత గడువులోగా ఆప్షన్ పత్రం సమర్పించకుంటే.. ఏ రాష్ట్రంలో అయినా పనిచేయడానికి ఉద్యోగి సిద్ధంగా ఉన్నారని భావిస్తారు. స్థానికత, ఇతర అంశాల ఆధారంగా వారి కేటాయింపు జరుగుతుంది.

►  ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మార్పునకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు.

కేటాయింపు విషయంలో ఏ ఉద్యోగికైనా అభ్యంతరం, అయిష్టత ఉంటే ఆ విషయంపై తాను పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించాలి. ఒక ప్రతిని ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఆర్ విభాగానికి పంపించాలి.

ఉద్యోగుల అభ్యంతరాలపై నిబంధనల మేరకు అధికారిక వ్యాఖ్యలను జోడించి తుది నిర్ణయం కోసం కమిటీకి ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఆర్ విభాగం పంపించాలి. కమిటీ ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చించి, తుది సిఫారసులను కేంద్రానికి సమర్పిస్తుంది. కేటాయింపుల విషయంలో తుది నిర్ణయాన్ని కేంద్రమే తీసుకుంటుంది.తుది జాబితా విడుదల చేయనుంది. ‘కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలు ఫైనల్ అయ్యాయి. పది రోజుల్లో అభ్యంతరాలు తీసుకున్న తర్వాత తుది మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఆతర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ ఉంటుంది’ అని కమిటీతో భేటీ అనంతరం ఏపీ సీఎస్ కృష్ణారావు మీడియూకు చెప్పారు.  

 

మార్గదర్శకాలు ఇవీ..


 

►    2011 జనాభా లెక్కల మేరకు ఇరు రాష్ట్రాల జనాభా నిష్పత్తిలో పోస్టుల విభజన ఉంటుంది. తెలంగాణకు 41.68 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 58.32 శాతం పోస్టులు కేటాయించనున్నారు.

   అవిభక్త రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ చేయడానికి వీలున్న ఉద్యోగులు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది, రాష్ట్ర క్యాడర్ అధికారులు, రెండు రాష్ట్రాల మధ్య బదిలీకి అవకాశం ఉన్న మల్టీ జోనల్ క్యాడర్ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు విభజించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థలు, ప్రాజెక్టుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను విభజించనున్నారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ ఉద్యోగులనూ రెండు రాష్ట్రాలకు పంచనున్నారు.

 ళీఙ్ట్చఛగ్రామం, పట్టణం, సర్కిల్, మండలం, డివిజన్, జిల్లా, జోన్, మల్టీ జోన్(సీమాంధ్ర, తెలంగాణకు ఉమ్మడిగా లేని జోన్లు) పోస్టుల్లో పనిచేస్తున్న వారు విభజన పరిధిలోకి రారు. ఏ రాష్ట్రంలో ఉన్నవారిని ఆ రాష్ట్రానికే కేటాయించినట్లుగా భావించాలి.

►    భౌగోళికంగా ఏదో ఒక రాష్ట్రానికే చెందిన ఉద్యోగాలను ఆ రాష్ట్రానికే కేటాయించనున్నారు. ఆ పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను ఆ రాష్ట్రంలోనే కొనసాగించాలి.

►    తొలుత మొత్తం పోస్టులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసిన తర్వాత ఉద్యోగుల కేటాయింపులు ప్రారంభిస్తారు. కొత్త రాష్ట్రాల ఆవిర్భానికి ముందురోజు (2014 జూన్1) వరకు ఉన్న సీనియారిటీని కేటాయింపులకు ఆధారంగా తీసుకోనున్నారు. దీర్ఘకాలంగా గైర్హాజరవుతున్న, సెలవులో ఉన్న, ఆచూకీ లేని ఉద్యోగులతో పాటు డిప్యుటేషన్, శిక్షణలో ఉన్న ఉద్యోగులనూ కేటాయింపుల్లో పరిగణనలోనికి తీసుకోవాలి.

 ►  ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి అవకాశం ఉన్న ఉద్యోగులందరికీ ‘ఆప్షన్’ ఇవ్వనున్నారు. పాలనా సౌలభ్యం, ప్రజా ప్రయోజనాలు, ఆయా రాష్ట్రాల అవసరాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ రాష్ట్రానికి కేటాయించాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. అందరి కంటే సీనియర్లు ఇచ్చిన ‘ఆప్షన్’కు ప్రాధాన్యత ఉంటుంది. ఏ రాష్ట్రంలో అయినా నిర్దిష్ట క్యాడర్‌లో పోస్టులు మిగిలిపోతే అందరికంటే జూనియర్లను (రివర్స్ సీనియారిటీ ఆధారంగా) ఆ రాష్ట్రానికి కేటాయిస్తారు.

    రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న ‘ఏడేళ్ల విద్యాభ్యాసం’ నిబంధన మేరకు స్థానికతను నిర్ధారిస్తారు. సర్వీసు రికార్డులో పేర్కొన్న మేరకు లేదా విద్యాభ్యాసం ధ్రువపత్రాల ఆధారంగా స్థానికతను సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ధ్రువీకరించాలి. తప్పుడు పత్రాలు పెట్టినట్లు రుజువయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. అయితే ఈ నిబంధన ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ స్థానికులు కాని ఉద్యోగుల స్థానికతను వారి స్వస్థలం ఆధారంగా నిర్ణయిస్తారు.

►  ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను వారిచ్చిన ఆప్షన్ మేరకే కేటాయిస్తారు. ఆప్షన్ ఇవ్వకపోతే వారి స్థానిక రాష్ట్రానికి కేటాయిస్తారు.

    నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లను స్థానికత ఆధారంగా కేటాయిస్తారు. ఆప్షన్ ఇస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి వీలయినంతమేర ప్రయత్నిస్తారు.

►    అఖిల భారత సర్వీసు అధికారి భార్య/భర్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే, వారి ఆప్షన్ మేరకే కేటాయింపు ఉంటుంది.

   దంపతులు ఇద్దరూ ఉద్యోగులైతే వారిచ్చే ఆప్షన్ మేరకు ఇద్దరినీ ఒకే రాష్ట్రానికి కేటాయిస్తారు.

►   ఒంటరి మహిళలు (వితంతువులు, విడాకులు తీసుకున్నవారు), 40 శాతానికి మించి అంగ వైకల్యం ఉన్న వారి ఆప్షన్లకు ప్రాధాన్యత ఇస్తారు.

    ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్, మూత్రపిండాల సమస్య, ఇతర తీవ్రమైన రోగపీడితులుంటే.. వారి ఆప్షన్ ప్రకారమే కేటాయింపులు జరుపుతారు.

   స్థానికత అర్హత ఉన్న ఉద్యోగులుంటే తప్ప ఖాళీ పోస్టులను ఉద్యోగుల పంపిణికీ వాడకూడదు.

►    క్యాడర్ కూర్పులో డెరైక్ట్ రిక్రూటీలు, ప్రమోటీల శాతాన్ని, రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకొని పంపిణీ చేయూలి.

    కొన్ని శాఖల్లో మంజూరు పోస్టు ఒక్కటే ఉన్నా, అదే క్యాడర్‌లో చాలామంది ఉద్యోగులు ఉంటారు. అలాంటి సందర్భంలో ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తారు.

  బోధన, వైద్య రంగంలో స్పెషలైజేషన్ వారీగా పోస్టులను విభజించి ఇరు రాష్ట్రాలకు కేటాయించాలి. సీనియారిటీని కూడా స్పెషలైజేషన్ వారీగానే నిర్ధారించాలి.

►   రాష్ట్రాల ఆవిర్భావం జరిగిన తర్వాత పదవీ విరమణ చేసిన లేదా మరణించిన ఉద్యోగులను కూడా పంపిణీ చేయాలి.

►   ఇతర శాఖలు, విభాగాలు, సంస్థల్లో డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నా.. మాతృశాఖలోనే చూపించాలి.

►    సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, ప్రాజెక్టుల్లో డిప్యుటేషన్ లేదా టెన్యూర్ మీద పనిచేస్తున్న లోకల్ క్యాడర్ ఉద్యోగులను వారి మాతృశాఖకు పంపిస్తారు.

    ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థల ద్వారా రాష్ట్రాల ఆవిర్భావానికంటే ముందే కేటాయించి ఉంటే.. వారి ప్రాధాన్యతను అడుగుతారు. కానీ ఏ రాష్ట్రానికి కేటాయించినా పని చేయాల్సిందే.

    ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు-9, 10లో పేర్కొన్న సంస్థలు, సంఘాల ఉద్యోగుల విభజననూ కమలనాథన్ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షిస్తుంది.

   రాష్ట్ర విభజన తర్వాత ఏ రాష్ట్రమైనా కొత్త పోస్టులు సృష్టించి ఉంటే, ఉద్యోగుల తుది కేటాయింపులో వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.

 

స్థానికతపై వివరణేది? ఉద్యోగ సంఘాల నేతల పెదవి విరుపు



ప్రభుత్వ ఉద్యోగుల విభజన విషయంలో కమలనాథన్ కమిటీ ఇచ్చిన మార్గదర్శకాల్లో అన్ని అంశాలు బాగున్నప్పటికీ స్థానికతపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం ప్రధాన లోపమని ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ అధికారుల సంఘ అధ్యక్షులు కె.వి. కృష్ణయ్య, వైద్య ఆరోగ్య శాఖ గెజిటెడ్ అధికారుల సంఘ అధ్యక్షులు విజ్‌డం చౌదరి పేర్కొన్నారు. సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల విభజనకు సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకున్నప్పటికీ ఆర్టికల్ 371 డి ,తదనుగుణంగా వచ్చిన ప్రెసిడెన్షియల్ నియమాలను అనుసరించి స్థానికతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు ఆప్షన్ అనే పదం మార్గదర్శకాలలో ఎక్కడా లేదన్నారు.



సచివాలయం, హెచ్‌ఓడిలలో పనిచేసే ఉద్యోగులకు స్థానికత అనే అంశం వర్తించదనే విషయాన్ని విస్మరించి మార్గదర్శకాలను రూపొం దించడం ప్రధాన లోపమని వారు పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో అయినా నిర్దిష్ట క్యాడర్‌లో పోస్టులు మిగిలి పోతే.. అందరి కంటే జూనియర్లను (రివర్స్ సీనియారిటీ ఆధారంగా) ఆ రాష్ట్రానికి కేటాయిస్తారంటూ మార్గదర్శకాల్లో పెట్టిన నిబంధనపట్ల మురళీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పోస్టులు సృష్టించి ఉంటే వాటిని తుది కేటాయింపుల్లో పరిగణనలోనికి తీసుకుంటామంటూ ఉన్న మరో నిబంధన కొంత ఊరట కలిగిస్తోందన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top