'ట్రంప్ కంటే నియంతలా బాబు వ్యవహరిస్తున్నారు'
వైఎస్సార్ జిల్లా : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కువ నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు.
వైఎస్సార్ జిల్లాలో ఆదివారం టీడీపీ జడ్పీటీసీ, ఇద్దరు ఎంపీటీసీలు వైఎస్ వివేకానందరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రజలు తగిన సమయంలో చంద్రబాబుకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.