బరితెగించిన టీడీపీ

బరితెగించిన టీడీపీ - Sakshi

నంద్యాలలో ఓటర్లకు డబ్బు పంచుతూ అడ్డంగా దొరికిన ఆ పార్టీ సర్పంచ్‌

 

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ నేతలు బరితెగించారు. ఓటర్లకు డబ్బులు పంచుతూ ఆదివారం రాత్రి అడ్డంగా దొరికిపోయారు. నంద్యాల మండలం రైతునగరం గ్రామ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నేత లక్ష్మీకొండారెడ్డి స్థానిక క్రాంతినగర్‌లో ఓటుకు రూ. 5 వేలు పంచుతున్నట్లు ‘సాక్షి’కి సమాచారం అందింది. అక్కడికి వెళ్లి చూడగా ఓటర్లకు ఆయన డబ్బులు పంచుతూ కనిపించారు.



రైతునగరం పంచాయతీలో 3 వేల మందికి సర్పంచ్‌ ఆధ్వర్యంలో ఓటుకు రూ. 5 వేలు చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. ఇక్కడే కాకుండా నంద్యాల, గోస్పాడు మండలాల్లోని గ్రామాలతో పాటు నంద్యాల పట్టణంలోని 42 వార్డుల్లో కూడా టీడీపీ నాయకులు ఓటుకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top