'ఇద్దరు కేంద్రమంత్రులను వెనక్కి పిలిస్తే సరి..'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై టీడీపీ ఒత్తిడి చేయాలని చంద్రగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఏపీకి ప్రత్యేక హోదా'పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ఇద్దరు కేంద్రమంత్రులను టీడీపీ వెనక్కి పిలిస్తే ...కేంద్రం దిగి వస్తుందని అన్నారు. కాగా బీజేపీతో పొత్తులో భాగంగా టీడీపీకి...కేంద్రంలో రెండు మంత్రి పదవులను కేటాయించిన విషయం తెలిసిందే.