టీడీపీ సానుభూతిపరుడి హత్య


ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షేక్సాన్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు నారాయణస్వామిని మంగళవారం తెల్లవారుజామున దుండగులు బండరాయితో తలపై మోది హత్య చేశారు. నారాయణస్వామి వాకింగ్‌కు వెళుతుండగా గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top