వెల్లంపల్లి ఇంటి ముట్టడికి టీడీపీ యత్నం

విజయవాడలో టీడీపీ నేతల జులుం - Sakshi


విజయవాడ: ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్న టీడీపీ నాయకులు మరోసారి తమ జూలుం ప్రదర్శించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ నివాసం ముట్టడికి టీడీపీ నేతలు శుక్రవారం యత్నించారు. సీఎం చంద్రబాబు అవినీతి గురించి నిన్న మీడియా సమావేశంలో వెల్లంపల్లి ఆరోపణలు చేశారు. దీనికి నిరసనగా టీడీపీ నేతలు ఇవాళ ఆయన ఇంటి ముట్టడికి యత్నించారు. పోలీసులు కలుగజేసుకుని వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకుంది.



మరోవైపు టీడీపీ నేతల తీరుపై వెల్లంపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే రౌడీయిజం చేస్తారా అని మండిపడ్డారు. టీడీపీ నేతల రౌడీయిజానికి ఇదొక నిదర్శనమని, వారికి దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి, లోకేష్‌ల అవినీతిపై తాను చర్చకు సిద్ధమేనని వెల్లంపల్లి స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top