'తాడిపత్రి వదిలివెళ్లండి.. లేకుంటే చంపేస్తాం'
అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో టీడీపీ నేతలు బుధవారం దౌర్జన్యయానికి దిగారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కిషోర్పై టీడీపీ నేతలు దాడి చేశారు. అంతేకాకుండా అతని కుటుంబంపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురికి గాయాలయినట్టు తెలుస్తోంది.
కిషోర్ తన కుటుంబంతోపాటు తాడిపత్రి వదిలిపెట్టి పోవాలని, లేకుంటే చంపేస్తామని టీడీపీ నేతలు బెదిరింపు చర్యలకు పాల్పడినట్టు సమాచారం. కాగా, టీడీపీ నేతల దాడిలో గాయాలపాలైన ఐదుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.