వైసీపీ నేతపై టీడీపీ కార్యకర్తల దాడి


కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతపై అధికార టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కర్నూలు జిల్లా అవుకు మండలం శివవరం గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వైసీపీ నేత జగదీష్‌రెడ్డిపై టీడీపీ వర్గీయులు గొడ్డలితో దాడి చేశారు. దీంతో జగదీష్రెడ్డి చేతికి తీవ్ర గాయమైంది.


క్షతగాత్రుడిని అతని బంధువులు బనగానిపల్లెలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఈ దాడికి వ్యక్తిగత విభేదాలే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top