టీడీపీ నేతలు జేబుదొంగల కంటే హీనం: రఘువీరా

టీడీపీ నేతలు జేబుదొంగల కంటే హీనం: రఘువీరా - Sakshi


దొరికిన కాడికి దోచుకుంటున్నారు

వైఎస్సార్ సీపీపై గెలవలేక ఎందరి కాళ్లో పట్టుకున్నారు

అనంతపురం:
కార్పొరేట్ శక్తుల చేతిలో సీఎం చంద్రబాబు బందీ అయ్యారని, టీడీపీ నేతలు జేబు దొంగల కన్నా హీనంగా మారారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మాఫీచేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురంలో గురువారం మాజీ మంత్రి శైలజానాథ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా విస్త్రృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరా ప్రసంగిస్తూ.. టీడీపీ వెబ్‌సైట్‌లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు సంబంధించి 52 పేజీలను తొలగించారని, గోడల మీద రాసిన రాతలను తుడిపేశారని చెప్పారు.

 

టీడీపీ నేతలు దొరికిన కాడికి దోచుకుంటున్నారని, చివరికి సిఫారసు లేఖలకు కూడా డబ్బు వసూలు చేస్తున్నారన్నారు. దేవినేని నెహ్రూ మాట్లాడుతూ నారా లోకేష్ రూ.2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, వాటికి సంబంధించిన ఆధారాలను సమయం వచ్చినప్పుడు బయటపెడతామన్నారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిపై గెలవడానికి చంద్రబాబు ఎందరి కాళ్లో పట్టుకున్నాడు. మోడీ కాళ్లు పట్టుకున్నాడు. పవన్‌కళ్యాణ్ గడ్డం పట్టుకున్నాడు.’ అని పేర్కొన్నారు. పార్టీ నేతలు చిరంజీవి, బొత్స, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top