'తమ్ముళ్ల' దాడి : వైఎస్సార్సీపీ నేతలపై అక్రమకేసులు
వైఎస్సార్ జిల్లా : రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలు రోజుకో ప్రాంతంలో వెలుగులోకి వస్తున్నాయి. మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలకు కూడా టీడీపీ నేతలు వెనుకాడడం లేదు. తాజాగా వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ నేతల దాడికి పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
కడప 31వ డివిజన్ కార్పొరేటర్ సురేష్పై టీడీపీ నేతలు భౌతిక దాడులకు తెగబడ్డారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడి అనుచరులు విచక్షణారహితంగా కార్పొరేటర్పై దాడి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సురేష్ కొద్ది రోజు కిందట టీడీపీలో చేరారు. టీడీపీ నేతల వైఖరి నచ్చక సురేష్ తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో తెలుగు తమ్ముళ్లు సురేష్పై దాడి చేశారు. కార్పొరేటర్పై దాడిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ భాషా, మేయర్ సురేష్ బాబు అడ్డుకోబోయారు. ఈ ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాడి చేసిన టీడీపీ నేతలను వదిలేసి..వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. పోలీసులు తీరుపై స్థానికులు, వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.