'బాధితులకు అన్ని రకాల సాయం చేశాం'
హైదరాబాద్:హుదూద్ బాధితులకు అన్ని రకాల సాయం చేశామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈసారి చేసినంతంగా సాయం చేయలేదన్నారు. శుక్రవారం అసెంబ్లీ వేదికగా ప్రసంగించిన అచ్చెన్నాయుడు.. 2800 కి.మీ పాదయాత్ర చేసిన తర్వాత పేదవాడి కష్టాలు చూశారు కాబట్టే ఈసారి అందరికీ న్యాయం చేశారన్నారు.
హుదూద్ బాధితులకు ఎవరికైనా సాయం అందకపోతే తమ సూచించాలని అచ్చెన్నాయుడు అన్నారు. అంతే తప్ప పనిగట్టుకుని విమర్శలు చేయొద్దన్నారు.