అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారు
పాలసముద్రం: రాష్ట్రంలో చంద్రబాబు సాగిస్తున్న అనైతిక రాజకీయా లు, అవినీతి పాలనకు అడ్డుకట్ట వేయడానికి వైఎస్సార్సీపీ పోరా టం చేస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కల్లత్తూరు నారాయణస్వామి తెలి పారు. శుక్రవారం రాచపాళ్యంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.శివప్రకాశ్రాజు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సాగిస్తున్న అనైతిక రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బలోపేతం చేసేందుకు పార్టీ తరఫున పోరాటం చేస్తామన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను గాలికొదిలేసి అమరావతి పేరుతో అక్రమంగా దోచుకున్న అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు.
ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరోక పార్టీలో చేరిన నాయకులపై ఫిరాయింపుల నిరోధ క చట్టం కింద చర్యలు తీసుకోవాల న్నారు. చంద్రబాబుకి గుణపాఠం చెప్పాలంటే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేయడానికి కార్యకర్తలు సైనికుడిలా పని చేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సుబ్రమణ్యరెడ్డి, ఉపాధ్యక్షులు అన్భులగన్, పద్మనాభనాయుడు, ధనుంజయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.