టీడీపీ కౌన్సిలర్ దారుణ హత్య


అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. గురువారం సాయంత్రం గుర్తు తెలియని దుండగులు టీడీపీ కౌన్సిలర్ సాధిక్ ను వేటకొడవళ్లతో నరికారు.



ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సాధిక్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాసేపటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. సాధిక్ హత్య నేపథ్యంలో తాడిపత్రిలో బందోబస్తును పెంచారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top