'అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారు'


తమ పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టును తెలుగు దేశం పార్టీ నాయకులు ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వం అన్యాయంగా టీడీపీ నాయకులను కేసుల్లో ఇరికిస్తోందని అన్నారు. అసలు ఈ కేసుతో సండ్ర వెంకట వీరయ్యకు సంబంధం లేకపోయినా ఆయనపై ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టారని ఆరోపించారు.



సండ్ర వెంకట వీరయ్యను సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి సుమారు 7 గంటల పాటు విచారించిన తర్వాత ఏసీబీ వర్గాలు ఆయనను అరెస్టు చేశాయి. ఆయన అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top