ఏసీబీకి దొరికిన గూడెం ట్యాప్ ఇనస్పెక్టర్


తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్): అవినీతి నిరోధక శాఖకు మరో అవినీతి చేప చిక్కింది. కుళాయి మరమ్మతు కోసం లంచం డిమాండ్ చేసి , అది తీసుకొనే క్రమంలో తాడేపల్లిగూడెం మునిసిపాలిటీకి చెందిన ట్యాప్ ఇనస్పెక్టర్ అడ్డంగా దొరికి పోయారు . ట్యాప్ కనక్షన్ రిపేర్ నిమత్తం ట్యాప్ ఇనస్పెక్టర్ వై పాండురంగరాజు రూ 3 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం మునిసిపల్ కార్యాలయంలోని ట్యాప్‌ఇనస్పెక్టర్ భవనం వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.



ఈ సందర్భంగా వి గోపాల కృష్ణ మాట్లాడుతూ మూడు వేలును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ట్యాప్ ఇనస్పెక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top