'జేసీ... అహంకారపూరితంగా మాట్లాడొద్దు'
హైదరాబాద్: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అహంకారపూరితంగా, అవివేకంగా మాట్లాడొద్దని జేసీకి సూచించారు. పోలవరం కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే... ఆ సమయంలో మనుగడ కోసం రాజకీయ పార్టీల కోసం జేసీ పాదయాత్ర చేశారని ఆరోపించారు.
గతంలో జేసీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మూతపడిందని గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీ మూతపడుతుందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో సుస్థిరంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.