ఏపీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు అనంతపురం, ప్రకాశం జిల్లాలలో స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ రోగులు చికిత్స పొందుతున్నారు.
కాగా గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో యూసఫ్గూడకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం మరణించాడు. తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో 29 మంది మరణించారు. మరో 1500 మంది స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్థారణ అయింది. స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడిన పలువురు ఇప్పటికే నగరంలోని పలు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్నారు.