సచివాలయం ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం


- ఆర్థిక సాయం కోసం వచ్చి పురుగు మందు తాగిన నెల్లూరు జిల్లా వాసి 

జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి 

 

గుంటూరు ఈస్ట్‌: ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్న ఆశతో సచివాలయానికి చేరుకున్న ఓ వ్యక్తి అక్కడి పరిస్థితిని గమనించి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతుడి కుమారుడు వెంకటేశ్వర్లు కథనం మేరకు... నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం తాళ్లపల్లికి చెందిన గండికోట రాజగోపాల్‌(50) ఆయుర్వేద వైద్యుడు. 2007లో అతని భార్య మృతి చెందింది. పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు కారు డ్రైవర్‌గా పనిచేస్తూ బీటెక్‌ పూర్తి చేశాడు. రెండో కుమారుడు అయ్యప్ప బెంగళూరులో బీసీఏ చదువుతున్నాడు. రాజగోపాల్‌కు ఆస్తిపాస్తులు లేవు.



కుమారులను ఉన్నత చదువులు చదివించాలని తాపత్రయపడ్డాడు. అందుకోసం ప్రభుత్వం నుంచి సాయం అందుతుందేమోనని భావించి శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వద్దకు చేరుకున్నాడు. అయితే, అక్కడ తనకు ఎలాంటి సహాయం అందదని నిర్ధారించుకుని సచివాలయం ప్రాంగణంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. రాజగోపాల్‌ జేబులో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top