‘నవ్యాంధ్ర’ కోసం సుదర్శన యాగం
అమరావతి (గుంటూరు): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతి అమరేశ్వరాలయంలో మే నెల 25వ తేదీ నుంచి 29 వరకు సుదర్శనయాగం జరుపనున్నట్లు ఆలయ ఈవో ఎన్.శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం, నవ్యాంధ్ర సంకల్ప సిద్ధి కోసం 108 యజ్ఞ వాటికలతో జరిగే ఈ యాగాన్ని భక్తులు జయప్రదం చేయాలని కోరారు.