నీటి కోసం విద్యార్థినుల అవస్థలు
కడప: అధికార పార్టీకి చెందిన ఓ కాంట్రాక్టరు నిర్లక్ష్యంతో విద్యార్థినులు నీళ్ల కోసం నానా పాట్లు పడాల్సి వస్తోంది. వైఎస్సార్జిల్లా కాశినాయన మండలం, వరికుంట్ల గ్రామంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో బోరు చెడిపోవడంతో విద్యార్థినులు నీళ్ల కోసం అవస్థలు పడుతున్నారు. కాంట్రాక్టర్ వారం క్రితం కొత్తగా బోరు వేసినప్పటికీ మోటార్ బిగించలేదు. దాంతో విద్యార్థినులు సమీపంలోని పొలాల్లో ఉన్న వ్యవసాయ బావుల నుంచి నీళ్లను మోసుకోవాల్సి వస్తోంది.
(కాశినాయన )