జగన్ దీక్షకు మద్దతుగా విద్యార్థుల ర్యాలీ


కమలాపురం (వైఎస్సార్ జిల్లా) :  ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా వైఎస్సార్ జిల్లా కమలాపురంలో స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.



ఈ ర్యాలీ గ్రామ చావిడి నుంచి ప్రాంభమై 3 రోడ్ల కూడలి వరకూ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంధ్రనాథరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం యువత ముందుకు  రావాలని పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top