ఏసీ కొనలేదని విద్యార్థిని ఆత్మహత్య

ఏసీ కొనలేదని విద్యార్థిని ఆత్మహత్య - Sakshi


రాజమండ్రి: తన ఇష్టం ప్రకారం ఏసీ కొనలేదని డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రాజమండ్రి పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. జాంపేట మఠం వీధికి చెందిన నందారపు శివజ్యోతి ఓ కళాశాలలో ఇటీవలే బీకాం ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసింది. ఆమె స్నేహితురాలి ఇంట్లో నూతనంగా ఏసీ కొనుగోలు చేశారు.



దాంతో తన ఇంట్లో ఏసీ పెట్టించాలంటూ శివజ్యోతి తల్లిదండ్రులను కోరింది. తల్లిదండ్రులు కొనలేమని చెప్పినా ఆ అమ్మాయి వినలేదు. ఏసీ విషయమై తల్లితో గొడవపడింది. మనస్తాపంతో శుక్రవారం రాత్రి తన గదిలో ఫ్యాన్ హుక్‌కు ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top