బొబ్బిలిలో విద్యార్థి ఆత్మహత్య
బొబ్బిలి(విజయనగరం): బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐ కాలేజీ విద్యార్థి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బాడెంగి మండలం మోగడ గ్రామానికి చెందిన షేక్ అలీఖాన్(19) బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఎలక్ట్రిషన్ ట్రేడ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం జరిగిన వర్క్షాపు పరీక్ష రాసిన అలీ తిరిగి ఇంటికి వెళ్లలేదు. అంతేకాకుండా శనివారం జరిగిన డ్రాయింగ్ పరీక్షకు సైతం గైర్హాజరయ్యాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం బావిలో శవంగా కనిపించాడు. విషయం తెలిసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం బొబ్బిలిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, అలీఖాన్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడని, బాగా చదివే వాడని తల్లిదండ్రులంటున్నారు.