పంట కాలువలో రాతి విగ్రహం

పంట కాలువలో రాతి విగ్రహం

సంగం(ఆత్మకూరు): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని ర్యాంపు వద్దనున్న కనిగిరి రిజర్వాయర్‌ ప్రధాన కాలువ సమీపంలోని ఓ పంట కాలువలో ఆదివారం పురాతన రాతి విగ్రహం బయటపడింది. కనిగిరి రిజర్వాయర్‌ ప్రధాన కాలువ నుంచి పడమటిపాళెం గ్రామ రైతులకు సాగునీరు అందించే కాలువలో నాలుగు అడుగుల ఎత్తైన రాతి విగ్రహాన్ని గాంధీజన సంఘం గ్రామానికి చెందిన ఓ చిన్నారులు గుర్తించారు.



రాతి విగ్రహం చేసిన విధానాన్ని బట్టి చూస్తే సుమారు 100 ఏళ్లకు పైగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. విగ్రహానికి ఎడమ చేతిలో శంకు, కుడిచేతిలో కిందకు చూపుతున్నట్లుగా కత్తి ఉన్నాయి. ఈ విగ్రహాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు తరలి వచ్చారు.

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top