మభ్యపెట్టడానికే రాజధాని ప్రకటనలు

మభ్యపెట్టడానికే రాజధాని ప్రకటనలు - Sakshi


విజయవాడ - గుంటూరు మధ్య  రాజధాని నిర్మించడమనేది కొందరిని మభ్య పెట్టడానికేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఎర్రచందనం అమ్మి అప్పులు తీరుస్తామనడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.



ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే ఎర్రచందనాన్ని టన్ను రూ. 2 లక్షల చొప్పున అమ్మారని, ఇప్పుడు ఎర్రచందనం అమ్మితే రాష్ట్రంలోని 20 మండలాలకే ఆ నిధులు సరిపోతాయని ఆయన చెప్పారు. రూ. 35 వేల కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేస్తాననడం రైతులు, మహిళలను మోసం చేయడమేనని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top