మరో 4 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో 4 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా నందిగామ కమిటీకి కొత్త వెంకట సాంబశివరావు, చిత్తూరు జిల్లా పలమనేరు కమిటీకి సి.రామచంద్ర నాయుడు, శ్రీకాకుళం కమిటీకి మూకాళ్ల శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం కమిటీకి ముత్యాల వీరభద్రరావును నియమించింది.
చైర్మన్లతో పాటు మరో 18 మంది సభ్యులు ఈ కమిటీలలో ఉంటారు.