ఇది జీరో బేసిడ్ బడ్జెట్: చంద్రబాబు
హైదరాబాద్: తమ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టినది జీరో బేసిడ్ బడ్జెట్ అని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. బడ్జెట్ సమావేశం అనంతరం బాబు అసెంబ్లీ బయట మీడియాతో చిట్చాట్ చేశారు. బడ్జెట్లో కేటాయింపులు తాత్కాలికమే అని... అవసరమైతే మార్చుకోవచ్చని తెలిపారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని పూడ్చుకునే పనిలో ఉన్నామని చెప్పారు.
రాజధానికి కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పారు. రాజధాని కోసం తాము చేయాల్సింది చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు ఆక్టోబర్ 2 నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. ఆ పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించామన్నారు. ఆర్బీఐ ఇబ్బందులు సృష్టించిన రుణమాఫీ చేసి తీరుతామని చంద్రబాబు వెల్లడించారు.