రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
పగిడ్యాల: రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణించాలని ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీపీ దివ్య పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీడీవో అధ్యక్షతన రాష్ట్రస్థాయి క్రీడాకారుల ఎంపిక జట్టు సమావేశ వివరాలను వ్యాయామ ఉపాధ్యాయుడు రవికృష్ణ ప్రకటించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి గుంటూరులో ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలన్నారు. ఖో ఖో శిక్షణలో పాల్గొన్న క్రీడాకారులకు పది రోజులపాటు భోజన సదుపాయం కల్పించిన మాజీ జెడ్పీటీసీ సభ్యులు పుల్యాల నాగిరెడ్డిని వ్యాయామ ఉపాధ్యాయులు శాలువ, పూలమాలలు వేసి సన్మానించారు. అనంతరం రాష్ట్రస్థాయి జట్లు సభ్యుల పేర్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గిడ్డయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు రవికృష్ణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జట్టు ఇదే..
ప్రశాంత్ నాయక్, ప్రవీణ్( పాణ్యం), మనోహార్రెడ్డి, నరసింహ, శ్రీకాంత్లు(పగిడ్యాల), విష్ణు( ప్యాపిలి), మురళీ( వడ్డెమాను), ఎల్లరాజు( నందికొట్కూరు), చంద్రశేఖర్( ప్యాపిలి), మహేష్(కర్నూలు), పరుశురాముడు(ప్యాలకుర్తి).