ఒంటిమిట్టలో నవమి ఉత్సవాలు ప్రారంభం

ఒంటిమిట్టలో నవమి ఉత్సవాలు ప్రారంభం


వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఈ రోజు ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం పోతన జయంతి, రాత్రి శ్రీరామ జయంతి, శేష వాహనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top