20 నిమిషాల్లోనే శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం

20 నిమిషాల్లోనే శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం - Sakshi

శ్రీకాళహస్తి: మహాశివరాత్రి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీకాళహస్తి దేవస్థానం ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఏర్పాటుచేస్తోంది. రూ.500 టికెట్టుతో కేవలం 20 నిమిషాల్లో స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించింది. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.



ప్రత్యేక దర్శనం టోకెన్లు పొందాలంటే ఏదైనా గుర్తింపు కార్డును జతచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒకరోజు ముందు కొనుగోలు చేసే భక్తులకు రూ.250 రాయితీ ప్రకటించారు. సాధారణ భక్తులకు తిరుమల తరహాలో మహాలఘు దర్శనం అమలు చేస్తామన్నారు. మహాశివరాత్రికి ఆలయాన్ని తోరణాలు, విద్యుత్ లైట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top