ప్రత్యేక హోదా మరిచిపోవడమే..
సింహాచలం: ఏపీకి ప్రత్యేక హోదా మరిచిపోవడమేనని, ప్రత్యేక ప్యాకేజీ అయినా సాధించుకోవాలని పశ్చిమగోదావరి ఎమ్మెల్సీ కె.సత్యనారాయణరాజు అన్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం ఆయన దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో అన్ని పార్టీలు ఏదో రకంగా తప్పు చేశాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కష్టమేనని తెలిపారు. దర్శనార్థం వచ్చిన ఎమ్మెల్సీ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు.