శ్రీవారికి అరుదైన కానుక
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి శుక్రవారం అరుదైన కానుక అందింది. సిరిసిల్లకు చెందిన విజయ్ అనే చేనేత కార్మికుడు తాను స్వయంగా తయారుచేసిన అగ్గిపెట్టెలో పట్టే పట్టు వస్ర్తాన్ని శ్రీవారికి సమర్పించుకున్నాడు. గతంలో కూడా విజయ్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర తయారు చేసిన విషయం తెలిసిందే.