కానిస్టేబుల్ మురళిపై సస్పెండ్ వేటు
ఏలూరు :
వైఎస్ఆర్సీపీ నేత సత్యనారాయణపై దాడికి పాల్పడ్డ కానిస్టేబుల్ మురళిపై సస్పెండ్ వేటు పడింది. దెందులూరు నియోజక వర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలపై మంగళవారం ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సత్యనారాయణపై కానిస్టేబుల్ మురళి దాడికి దిగాడు. చింతమనేని రమ్మంటున్నారంటూ ఎస్పీకార్యాలయం ఆవరణలోనే సత్యనారాయణపై మురళి దాడికి పాల్పాడ్డాడు.
కానిస్టేబుల్ మురళి దౌర్జన్యంపై వైఎస్ఆర్సీపీనేతలు ఆళ్లనాని, కోఠారు రామ చంద్రరావు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదుతో ఎస్పీ విచారణ చేపట్టి, అనంతరం మురళిని సస్పెండ్ చేశారు.