త్వరలోనే భారీ ఎత్తున కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్


ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్న పోలీసు శాఖ



సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు, ఇతర అవసరాలకు భారీ ఎత్తున పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. కనీసం 6 నుంచి 7 వేల మంది కానిస్టేబుళ్లు అవసరమవుతారంటూ ప్రభుత్వానికి ఉన్నతాధికారులు ప్రతిపాదించనున్నారని తెలిసింది. ఇందులో సగం మందిని నియమించుకోవడానికి  ప్రభుత్వం అంగీకరిం చినా చాలని యోచనలో ఉన్నారు. వారం రోజుల్లో ప్రతిపాదనలను పంపించడానికి డీజీపీ కార్యాలయం సన్నాహాలు చేస్తోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top