త్వరలోనే భారీ ఎత్తున కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్న పోలీసు శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు, ఇతర అవసరాలకు భారీ ఎత్తున పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. కనీసం 6 నుంచి 7 వేల మంది కానిస్టేబుళ్లు అవసరమవుతారంటూ ప్రభుత్వానికి ఉన్నతాధికారులు ప్రతిపాదించనున్నారని తెలిసింది. ఇందులో సగం మందిని నియమించుకోవడానికి ప్రభుత్వం అంగీకరిం చినా చాలని యోచనలో ఉన్నారు. వారం రోజుల్లో ప్రతిపాదనలను పంపించడానికి డీజీపీ కార్యాలయం సన్నాహాలు చేస్తోంది.