తండ్రితో పాటు పక్కింటి వ్యక్తిని హతమార్చాడు


చిత్తూరు :   చిత్తూరు జిల్లా పీలేరు మండలం మేళ్లచెర్వులో  దారుణం జరిగింది. భూ తగాదాలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. పున్నామ నరకం నుంచి కాపాడాల్సిన ఆ తనయుడు క్షణికావేశానికి లోనై కన్నతండ్రినే హతమార్చాడు. శనివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న కేశవరెడ్డికి... కొడుకు విశ్వనాథ్ రెడ్డికి గత కొంతకాలంగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి.



ఈ రోజు ఉదయం అదికాస్తా తారాస్థాయికి చేరటంతో విశ్వనాథ్ రెడ్డి ...తండ్రిపై దాడి చేయటంతో అతను తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన కృష్ణయ్య అనే వ్యక్తి  ప్రశ్నించటంతో కోపం పట్టలేని విశ్వనాథ్ రెడ్డి ...అతడిపై కూడా దాడి చేయటంతో  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాంతో చుట్టుపక్కలవారు....విశ్వనాథ్రెడ్డిని బంధించి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, విచారణ జరుపుతున్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top