రెండో పెళ్లి చేసుకున్నాడని..
పోరుమామిళ్ల (వైఎస్సార్ జిల్లా) : రెండో పెళ్లి చేసుకున్నాడనే కోపంతో కన్నకొడుకే తండ్రిని అంతం చేశాడు.ఈ ఘటన వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లలో శుక్రవారం జరిగింది. మోపూరి గోపయ్య (60) మొదటి భార్య 18 ఏళ్ల క్రితమే మృతి చెందింది. అయితే గత నెలలో గోపయ్య రెండో వివాహం చేసుకుని కడపలో lనివాసం ఉంటున్నాడు.
పోరుమామిళ్లలో ఉండే గోపయ్య కుమారుడు శుక్రవారం గోపయ్య ఇంటికి వెళ్లాడు. తండ్రి రెండో వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న అతను.. తండ్రి మెడకు టవల్ చుట్టి ప్రాణాలు తీశాడు. దీనిపై గోపయ్య రెండో భార్య మైదుకూరు డీఎస్పీకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.