తల్లిపై దాడి చేసిన పుత్రరత్నం
ఒంగోలు: నవ మాసాలు మోసి... కని పెంచి పెద్దవాడిని చేసిన కన్న తల్లిపై ఓ కన్న కొడుకు కర్కశంగా ప్రవర్తించాడు. ఆస్తి పంచడం లేదని కన్న తల్లిపై ఇనుపరాడ్తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దాంతో ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. అనంతరం కొడుకు పరారయ్యాడు. ఆ దారుణం ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట విలేకర్ల కాలనీలో చోటు చేసుకుంది.
స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.