'ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత ఉండవల్లికి లేదు'
రాజమండ్రి: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు శుక్రవారం రాజమండ్రిలో నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత ఉండవల్లి అరుణ్కుమార్కి లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నరు.
గతంలో ఎంపీగా ఉన్న ఉండవల్లి లోక్సభలో రాష్ట్రం గురించి కనీసం 5 నిమిషాలు కూడా ప్రసంగించలేదని ఎద్దేవా చేశారు. ఉండవల్లి తన జ్ఞానాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలని హితవు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఇప్పటికీ కట్టుబడి ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేసి తీరుతుందని తెలిపారు.